Header Banner

తిరుమల క్యూ లైన్‌లో నినాదాలు చేసింది వైసీపీ నేతే..! బైండోవర్ కేసు నమోదు!

  Sun Jun 01, 2025 11:40        Politics

తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లో శుక్రవారం రాత్రి నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బద్దిలి అచ్చారావు (బాబ్జీ)గా అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు సన్నిహిత అనుచరుడిగా అతడికి పేరుంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అచ్చారావు స్థానికంగా ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఆలయ నూతన నిర్మాణానికి టీటీడీ నుంచి సుమారు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం గమనార్హం. అచ్చారావుకు తిరుమల యాత్ర కొత్తేమీ కాదని, సర్వదర్శనానికి పట్టే సమయం గురించి ఆయనకు ముందే అవగాహన ఉంటుందని, అయినప్పటికీ ఇలా ప్రవర్తించడం వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చారావు నినాదాలు చేస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోలో వైసీపీకి చెందిన తిమ్మాపురం సర్పంచి బెజవాడ సత్యనారాయణ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై తిరుమల పోలీసులు అచ్చారావుపై బైండోవర్‌ కేసు నమోదు చేశారు.

 ఇది కూడా చదవండి: విశాఖ టూ శ్రీలంక ప్రత్యేక టూర్! ఇప్పుడు తక్కువ ధరలోనే!


అసహనంతోనేనని: టీటీడీ అదనపు ఈవో
క్యూలైన్‌లో నినాదాలు చేసిన అచ్చారావుతో మాట్లాడామని, అసహనంతోనే ఆ విధంగా ప్రవర్తించినట్లు ఆయన చెప్పారని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి మీడియాకు వెల్లడించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం, రద్దీ గురించి తెలియకపోవడం వల్ల దర్శనం ఆలస్యమవుతోందని భావించి నిరసన తెలిపినట్లు అచ్చారావు అంగీకరించారని చెప్పారు. క్యూలైన్‌లో అన్నప్రసాదాలు, పాలు అందిస్తుండటాన్ని గమనించి తన తప్పు తెలుసుకున్నారని, మానసిక క్షోభకు గురై, పశ్చాత్తాపంతో తమను క్షమించమని అచ్చారావు కోరినట్లు అదనపు ఈవో వివరించారు. భక్తులను రెచ్చగొట్టి, వీడియోలు తీసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

వైసీపీ కుట్రే
ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొంతకాలంగా వైసీపీ కుట్రలు చేస్తోందని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో ఎస్వీ గోశాల వివాదం, తిరుమలలో ఓ ముస్లిం వ్యక్తి నమాజు చేయడం, తాజాగా క్యూలైన్‌లో నిరసన వంటి ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని అన్నారు. టీటీడీ చైర్మన్, అధికారులపై అనవసరంగా నినాదాలు చేయడం వెనుక కూడా వైసీపీ కుట్ర ఉందని జనసేన తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్‌రాయల్‌ ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 


ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

 

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Tirumala #YSRCPLeader #BindOverCase #TirumalaTensions #TTDNews #DevoteeDisturbance